టీడీపీలో చేరిన పలువురు ముస్లిం మైనార్టీలు

ABN , First Publish Date - 2022-05-16T05:30:00+05:30 IST

పలువురు ముస్లిం మైనార్టీ లు సోమవారం మదనపల్లె నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్‌ ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకు న్నా రు.

టీడీపీలో చేరిన పలువురు ముస్లిం మైనార్టీలు
మాజీ ఎమ్మెల్యే రమేశ్‌ ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన ముస్లిం మైనార్టీలు

మదనపల్లె టౌన్‌, మే 15: పలువురు ముస్లిం మైనార్టీ లు సోమవారం మదనపల్లె నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్‌ ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకు న్నా రు.  స్థానిక టీడీపీ కార్యాల యం వద్ద  దొమ్మలపాటి మా ట్లాడుతూ రాజంపేట పార్లమెంట్‌ మైనారిటీ సెల్‌ ఉపాధ్యక్షుడు ముక్తియార్‌ ఆధ్వర్యంలో 20మంది ముస్లిం మైనార్టీలు టీడీపీ కండువా కప్పుకున్నారన్నారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పాలనలోనే ముస్లింలకు సంక్షేమపథకాలు అందాయని, సీఎం జగన్‌ ముస్లింలకు ద్రోహిగా మారాడన్నారు. రాష్ట్రంలో ముస్లిం మైనారిటిల మద్దతు టీడీపీకే వుందని మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి పేర్కొన్నారు. కార్యక్రమంలో యశశ్వి, ఎస్‌ఎం రఫి, తాజ్‌బాషా, నిస్సార్‌అహ్మద్‌, సికిందర్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-05-16T05:30:00+05:30 IST