అనారోగ్య కారణాలతో సెలవులు కోరుతున్న పలువురు ఎంపీలు

ABN , First Publish Date - 2020-09-17T15:06:38+05:30 IST

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు రాజ్యసభకు చెందిన పలువురు ఎంపీలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు పూర్తి దూరంగా, లేదా కొద్ది రోజులు...

అనారోగ్య కారణాలతో సెలవులు కోరుతున్న పలువురు ఎంపీలు

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు రాజ్యసభకు చెందిన పలువురు ఎంపీలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు పూర్తి దూరంగా, లేదా కొద్ది రోజులు దూరంగా ఉండేందుకు అనుమతి కోరుతున్నారు. ఈ విషయాన్ని రాజ్యసభ సభాపతి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. వీరంతా అనారోగ్య కారణాలతో సెలవులు కోరుతున్నారని తెలిపారు. ఇటువంటి వారిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆస్కార్ ఫర్నాండీజ్, పీ. చిదంబరంతో పాటు మరికొంతమంది ఉన్నారన్నారు.  


Updated Date - 2020-09-17T15:06:38+05:30 IST