హైదరాబాద్ : కరోనా తర్వాత పరిస్థితులు మళ్ళీ దాదాపుగా సాధారణ స్థితికి వచ్చేయడంతో... ఈ కామర్స్ సంస్థలు పండుగ సీజన్ను టార్గెట్ చేశాయి. అక్టోబరు మొదటి వారంలో మొత్తంగా మూడు ‘షాపింగ్ ఫెస్టివల్స్’ ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో... ఆఫర్లలో భాగంగా... మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ టీవీలు, ట్యాబ్లెట్ పీసీలు తదితర ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై అమెజాన్ భారీ తగ్గింపును ఇవ్వనుంది. నాలుగో తేదీ నుంచి అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’, మూడవ తేదీ నుంచి మింత్రా ‘బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ ప్రారంభించనున్నట్టు ప్రకటించాయి.
మరోపక్క ఫ్లిప్కార్ట్ ‘ద బిగ్ బిలియన్ డేస్’ విక్రయాలు అక్టోబరు 7-12 తేదీల్లో నిర్వహించనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. ఇక మరో బంపర్ ఆఫర్ కింద... శాంసంగ్, సోనీ, ఆపిల్, ఆసుస్, ఫాజిల్, వన్ప్లస్, హెచ్పీ, లెనోవో, షావోమికి చెందిన వెయ్యికి పైగా కొత్త ఉత్పత్తులను ఈ సేల్లో భాగంగా లాంచ్ చేయనున్నారు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ విక్రయాలు సుమారు నెల రోజుల పాటు కొన గుతాయి. మరోవైపు ఫ్లిప్కార్ట్ అనుబంధ సంస్థ మింత్రా అక్టోబరు 3-10 తేదీల్లో బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది.