ఎనఎస్‌యూఐలోకి పలువురి చేరిక

ABN , First Publish Date - 2021-09-17T06:36:34+05:30 IST

ఏపీసీసీ చీఫ్‌ సాకే శైలజానాథ్‌ సమక్షంలో పలువురు విద్యార్థులు గురువారం ఎనఎస్‌యూఐలో చేరారు. ఆయన వారికి ఎనఎస్‌యూఐ, కాంగ్రెస్‌ కండుపాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఎనఎస్‌యూఐలోకి పలువురి చేరిక
ఏపీసీసీ చీఫ్‌ శైలజానాథ్‌ సమక్షంలో ఎనఎస్‌యూఐలో చేరిన విద్యార్థులు

అనంతపురం రైల్వే, సెప్టెంబర్‌16: ఏపీసీసీ చీఫ్‌ సాకే శైలజానాథ్‌ సమక్షంలో పలువురు విద్యార్థులు గురువారం ఎనఎస్‌యూఐలో చేరారు. ఆయన వారికి ఎనఎస్‌యూఐ, కాంగ్రెస్‌ కండుపాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. నూ త న విద్యావిదానం పేరుతో  బీజేపీ మనుధర్మ శాస్ర్తాన్ని వి ద్యా ర్థుల మెదళ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తోందన్నారు. దీనికి వ్యతిరేకంగా ఎనఎస్‌యూఐ పోరాటం చేయాలన్నారు.  ఎళ్లవే ళలా అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్ర తాప్‌రెడ్డి, మైనార్టీ రాష్ట్ర నాయకుడు దాదాగాంధీ, ఎనఎస్‌ యూఐ రాష్ట్ర నాయకుడు నరేష్‌, జిల్లా అధ్యక్షుడు రాంబాబు, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-09-17T06:36:34+05:30 IST