ఉద్యోగులు బాధ్యతగా పనిచేయాలి
ABN , First Publish Date - 2020-10-23T11:10:43+05:30 IST
సచివాలయ ఉద్యోగులు గ్రామాలలో ఉన్న సమస్యల పరిష్కారంలో బాధ్యతగా పనిచేయాలని శాసనసభ్యుడు మానుగుంట మహీధర్రెడ్డి చెప్పారు.
లింగసముద్రం, అక్టోబరు 22 : సచివాలయ ఉద్యోగులు గ్రామాలలో ఉన్న సమస్యల పరిష్కారంలో బాధ్యతగా పనిచేయాలని శాసనసభ్యుడు మానుగుంట మహీధర్రెడ్డి చెప్పారు. స్థానిక వేముల అంజయ్య కల్యాణ మండపంలో ఎంపీడీవో మాలకొండయ్య అధ్యక్షతన సచివాలయ ఉద్యోగుల దిశా-నిర్దేశం కార్యక్రమం సందర్భంగా మెరుగ్గా పనిచేసిన సచివాలయ ఉద్యోగులకు జ్ఞాపికలను అందజేశారు. మండల ప్రత్యేకాధికారి ఎన్వీఎ్స మూర్తి, తహసీల్దార్ ఆర్ బ్రహ్మయ్య పాల్గొన్నారు.