మనూలో వెబినార్
ABN , First Publish Date - 2020-09-30T09:17:54+05:30 IST
గాంధీ జయంతి(అక్టోబర్ రెండు)ని పురస్కరించుకుని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో వెబినార్, చర్చా కార్యక్ర మం నిర్వహిస్తున్నామని వర్సిటీ ..
రాయదుర్గం, సెప్టెంబర్ 29 (ఆంధ్రజ్యోతి): గాంధీ జయంతి(అక్టోబర్ రెండు)ని పురస్కరించుకుని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో వెబినార్, చర్చా కార్యక్ర మం నిర్వహిస్తున్నామని వర్సిటీ అధికారులు తెలిపారు. ‘సమకాలీన కాలంలో మహాత్మాగాంఽ దీ’ అనే అంశంపై నిర్వహిస్తున్న ఈ వెబినార్ లో ఆసక్తిగల వారు పేర్లు నమోదు చేసుకుని లింక్ ద్వారా వెబినార్లో పాల్గొనవచ్చని ఇన్చారి రిజిస్ర్టార్ ప్రొఫెసర్ సిద్దిఖీ మహ్మద్ తెలిపా రు. కార్యక్రమంలో నెదర్లాండ్ నుంచి ప్రొఫెసర్ మోహన్కాంత్ గౌతం అతిథిగా పాల్గొంటారని, మనూ ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ ఎస్ఎం రెహ్మతుల్లా ముఖ్య కార్యనిర్వాహకుడిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.
వెబినార్లో పాల్గొనే వారి కి ఈ-సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ హెడ్ ప్రొఫెసర్ మహ్మద్ మొషాయిదీ, మనూ ఎన్ఎ్సఎ్ససెల్ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ మహ్మద్ ఫరియాదవ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అశ్వని వెబినార్ కో-ఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో పొలిటికల్ సైన్స్ హెడ్ ప్రొఫెసర్ అ పోజ్ అలాం, ప్రఖ్యాత చిత్రకారుడు పాండురంగారావు ఫ్యానలిస్టుగా ఉంటారు. కార్యక్రమాలు ఐఎంసీ మనూయూట్యూబ్ చానల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయని తెలిపారు.