త్వరలోనే మాన్సాస్ ట్రస్టు పాలకమండలి నియామకం: విజయసాయిరెడ్డి
ABN , First Publish Date - 2022-04-08T02:18:28+05:30 IST
త్వరలోనే మాన్సాస్ ట్రస్టు పాలకమండలిని నియమిస్తామని ఎంపీ
విశాఖ: త్వరలోనే మాన్సాస్ ట్రస్టు పాలకమండలిని నియమిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. సింహాచలం ట్రస్ట్ బోర్డు సభ్యులతో ఎంపీ విజయసాయిరెడ్డి సమావేశం అయ్యారు. సింహాచలం భూసమస్య కోర్టు పరిధిలో ఉందన్నారు. త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. దేవస్థానానికి ప్రత్యామ్నాయ స్థలం కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. పంచ గ్రామాల సమస్య కోర్టులో ఉందన్నారు. త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.