Telangana:బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్ ముందు మనోజ్ తల్లిదండ్రుల ఆందోళన

ABN , First Publish Date - 2022-05-16T17:18:01+05:30 IST

హైదరాబాద్ నగరం నాగోల్‌లోని బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్‌ ముందు మనోజ్ తల్లిదండ్రుల ఆందోళనకు దిగారు. తమ కొడుకు మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని

Telangana:బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్ ముందు మనోజ్ తల్లిదండ్రుల ఆందోళన

హైదరాబాద్‌: హైదరాబాద్ నగరం నాగోల్‌లోని బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్‌ ముందు మనోజ్ తల్లిదండ్రుల ఆందోళనకు దిగారు. తమ కొడుకు మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మనోజ్ మృతి ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇప్పటికే స్విమ్మింగ్ ఫుల్‌ నిర్వాహకుడు అశోక్‌ను అరెస్ట్ చేశారు. తమ బాబు మృతికి కారణమైన స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని మనోజ్ తల్లిదండ్రులు స్విమ్మింగ్ పూల్ ముందు టెంట్ వేసి ఆందోళనకు దిగారు. 24 గంటలు గడుస్తున్నా స్విమ్మింగ్ పూల్ యజమాన్యం, అధికారులు స్పందించకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. టెంట్ తొలగించాలని చైతన్యపురి సబ్‌ ఇన్‌స్పెక్టర్ చెప్పడంతో మనోజ్ తల్లిదండ్రులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు లంచం తీసుకుని  స్విమ్మింగ్ పూల్ యాజమాన్యం వైపు మాట్లాడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికారులు వచ్చేవరకు ఇక్కడి నుండి వెళ్లేది లేదన్నారు. మృతికి కారణమైన వారిపై  చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని సబ్‌ ఇన్‌స్పెక్టర్ చెప్పారు.  

Updated Date - 2022-05-16T17:18:01+05:30 IST