మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

ABN , First Publish Date - 2022-06-27T01:51:06+05:30 IST

మండలంలోని దుర్గంపల్లి గ్రామంలో ఇటీవల తేనే కోసం వెళ్లి మృత్యువాతపడ్డ వెంగయ్య, రమేష్‌ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఆదివారం మన ఫౌండేషన్‌ చైర్మన్‌ మన్నేటి వెంకటరెడ్డి ఆర్థికసాయం అందజేశారు.

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం
నగదు అందజేస్తున్న మన్నేటి వెంకటరెడ్డి

ఉదయగిరి రూరల్‌, జూన్‌ 26: మండలంలోని దుర్గంపల్లి గ్రామంలో ఇటీవల తేనే కోసం వెళ్లి మృత్యువాతపడ్డ వెంగయ్య, రమేష్‌ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఆదివారం మన ఫౌండేషన్‌ చైర్మన్‌ మన్నేటి వెంకటరెడ్డి ఆర్థికసాయం అందజేశారు. ఆయన మాట్లాడుతూ కూలి పనులు చేసుకొని కుటుంబాలను పోషిస్తున్న వెంగయ్య, రమే్‌షల మృతి చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వం వారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. భవిష్యత్తులో వారి కుటుంబాలకు సంస్థ ఆధ్వర్యంలో ఆర్థికంగా ఆదుకొంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు సుబ్బారెడ్డి, వెంకటసుబ్బమ్మ, యూటీఎఫ్‌ బాధ్యులు రంతుజానీ, భోగ్యం శ్రీనివాసులు, ఉప సర్పంచ్‌ చంద్రబాబు, నాయకులు శ్రీరాములు, ఆనందరావు, ప్రకాష్‌, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-27T01:51:06+05:30 IST