పార్టీ పూర్వ వైభవమే లక్ష్యం
ABN , First Publish Date - 2021-10-17T06:05:08+05:30 IST
పదవులు ముఖ్యం కాదని, పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చి చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమని టీడీపీ సీనియర్ నేత మన్నవ మోహనకృష్ణ తెలిపారు.
గుంటూరు, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): పదవులు ముఖ్యం కాదని, పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చి చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమని టీడీపీ సీనియర్ నేత మన్నవ మోహనకృష్ణ తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా మన్నవకు శనివారం అనుబంధ సంస్థ నేతలు, కార్యకర్తలు అభినందనులు తెలిపారు.
పనిచేసే వాడికి గుర్తింపు ఉంటుంది
పార్టీలో పనిచేసే ప్రతి నేతకు, కార్యకర్తకు తప్పక గుర్తింపు లభిస్తుందని పశ్చిమ టీడీపీ ఇనచార్జి కోవెలమూడి రవీంద్ర తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన సుఖవాసి శ్రీనివాసరావు రవీంద్రను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. కార్యక్రమంలో చింతకాయల రామారావు, నేపాక పద్మావతి, నేలం సైదయ్య, తన్నీరు కృష్ణ, ఉప్పతల సాంబ, పెద్ది విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.