సిసోదియాపై ఈసీకి నిర్భయ దోషి ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-02-22T08:08:05+05:30 IST
తాను పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా తిరస్కరించడంపై నిర్భయ దోషి వినయ్ శర్మ..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: తాను పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా తిరస్కరించడంపై నిర్భయ దోషి వినయ్ శర్మ.. ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాడు. తన పిటిషన్ను సిసోదియా తిరస్కరించినపుడు ఢిల్లీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, కాబట్టి ఆయనకు దాన్ని తోసిపుచ్చే అర్హత లేదని శర్మ పేర్కొన్నాడు.