మ్యాచ్‌ ఫిక్స్‌ చేయాలన్నాడు

ABN , First Publish Date - 2021-09-04T08:02:08+05:30 IST

గత మార్చిలో జరిగిన ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ మ్యా చ్‌ను ఫిక్స్‌ చేయాలని జాతీయ కోచ్‌ సౌమ్యదీప్‌ రాయ్‌ కోరాడని టీటీ స్టార్‌ మనికా బాత్రా సంచలన ఆరోపణ చేసింది.

మ్యాచ్‌ ఫిక్స్‌ చేయాలన్నాడు

జాతీయ కోచ్‌పై మనికా సంచలన ఆరోపణ

న్యూఢిల్లీ: గత మార్చిలో జరిగిన ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ మ్యా చ్‌ను ఫిక్స్‌ చేయాలని జాతీయ కోచ్‌ సౌమ్యదీప్‌ రాయ్‌ కోరాడని టీటీ స్టార్‌ మనికా బాత్రా సంచలన ఆరోపణ చేసింది. అందువల్లే టోక్యో ఒలింపిక్స్‌ సింగిల్స్‌ పోటీల సందర్భంగా అతడి సలహాలు తీసుకొనేందుకు తాను నిరాకరించానని తెలిపింది. ఈమేరకు భారత టీటీ సమాఖ్య తనకు జారీ చేసిన షోకాజ్‌ నోటీసుకు బదులిస్తూ.. మనికా ఈ విషయం వెల్లడించింది. గత మార్చిలో దోహాలో జరిగిన క్వాలిఫయర్స్‌లో అతని శిష్యురాలు ఒకరు ఒలింపిక్స్‌కు అర్హత సాధించేలా ఆమెతో మ్యాచ్‌లో తాను ఓడిపోవాలని సౌమ్యదీప్‌ తీవ్ర ఒత్తిడి తెచ్చాడని మనికా ఆరోపించింది. 

Updated Date - 2021-09-04T08:02:08+05:30 IST