మామిడి మహాప్రియం

ABN , First Publish Date - 2022-05-08T05:24:56+05:30 IST

మే నెల వచ్చిందంటే ఇళ్లల్లో మామిడి పచ్చడి పెట్టడంలో మహిళలు నిమగ్నం అవుతారు. తొక్కు మామిడి కాయలతో పాటు మిరపకాయలు, నూనెలు ఇతర పోపు వస్తువులను సమకూర్చుకుంటారు. కూరలు లేకున్నా పచ్చడితో తిని పనులకు వెళ్లే అవకాశం ఉంటుందని గ్రామీణులు దీనికి ఎంతో ప్రాధాన్యమిస్తుంటారు. అయితే ప్రస్తుతం మామిడి పచ్చడి పెట్టాలంటే జంకుతున్నారు.

మామిడి మహాప్రియం

తొక్కు తయారీకి ధరాఘాతం

 ఈసారి తగ్గిన మామిడి దిగుబడి

 సలసల కాగుతున్న వంట నూనెల ధరలు

 భగ్గుమంటున్న ఎండు మిర్చి


హుస్నాబాద్‌, మే 7: మే నెల వచ్చిందంటే ఇళ్లల్లో మామిడి పచ్చడి పెట్టడంలో మహిళలు నిమగ్నం అవుతారు. తొక్కు మామిడి కాయలతో పాటు మిరపకాయలు, నూనెలు ఇతర పోపు వస్తువులను సమకూర్చుకుంటారు. కూరలు లేకున్నా పచ్చడితో తిని పనులకు వెళ్లే అవకాశం ఉంటుందని గ్రామీణులు దీనికి ఎంతో ప్రాధాన్యమిస్తుంటారు. అయితే ప్రస్తుతం మామిడి పచ్చడి పెట్టాలంటే జంకుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా మామిడి కాయలే దొరకడం లేదు. దీనికి తోడు పచ్చడికి కావాల్సిన వస్తువుల ధరలు మండిపోతున్నాయి. 5 కిలోల మామిడి పచ్చడి పెట్టాలంటే దాదాపు రూ.3వేలకుపైగా ఖర్చవుతుంది. ఈ పౌర్ణమి తరువాత పచ్చడిల జోరు అందుకుంటుంది. కానీ ఈ సంవత్సరం ఏర్పడిన పరిస్థితులతో మక్కువ చూపడం లేదు.


ఒక మామిడి కాయకు రూ.15


గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి మామిడి కాయల దిగుబడి తగ్గిపోయింది. తొక్కు కాయల చెట్లకు సరైన సమయంలో పూత రాకపోవడంతో కాత లేకుండా పోయింది. గతంలో గ్రామాలు తిరుగుతూ పచ్చడి కాయలు అమ్మేవారు. సంతలో సైతం మామిడి కాయల విక్రయాలు జరిగేవి. ఈ సంవత్సరం డిసెంబర్‌ నుంచి ఏర్పడిన వాతవరణ పరిస్థితులతో మామిడికి గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. పిందెలు అయిన తర్వాత ఎండ వేడిమికి రాలి పోయాయి. ఇప్పటికీ కొన్ని చెట్లకు చిన్న సైజులోనే మామిడి కాయలున్నాయి. కొద్దో గొప్పో మామిడి కాయలు దొరికినా మార్కెట్‌లో రూ.15 నుంచి రూ.20 వరకు ధర పలుకుతోంది. గతంలో వంద, రెండు వందల పచ్చడి కాయలు పెట్టిన వారు ఈసారి 50 కాయలతో సరిపెట్టుకుంటున్నారు.


కిలో ఎండు మిర్చికి రూ. 250


మామిడి పచ్చడి పెట్టేందుకు వినియోగించే దొడ్డు, ఎండురకం మిర్చీల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. కిలో ఎండు మిర్చి రూ.250లకు పైగా ధర  పలుకుతున్నది. ఈ పచ్చడిలో ఎర్రగా ఉండే మిర్చిని వినియోగిస్తేనే సుమారు నాలుగైదు నెలలు నిల్వ ఉండి తాజాగా ఉంటుంది. అలాగే పల్లి నూనే ధరలకు కూడ రె క్కలు వచ్చాయి. మేలైన కిలో పల్లినూనె రూ.270 వరకు విక్రయిస్తున్నారు. ఇలా ధరలు పెరుగడంతో మామిడి పచ్చడి మహా ప్రియంగా మారింది.


 

Read more