ఐసీసీ టీ20 జట్టులో మంధాన
ABN , First Publish Date - 2022-01-20T06:42:42+05:30 IST
గతేడాదికిగాను ఐసీసీ ప్రకటించిన మహిళల టీ20 జట్టులో భారత స్టార్ బ్యాటర్ స్మృతీ మంధాన చోటు దక్కించుకుంది
దుబాయ్: గతేడాదికిగాను ఐసీసీ ప్రకటించిన మహిళల టీ20 జట్టులో భారత స్టార్ బ్యాటర్ స్మృతీ మంధాన చోటు దక్కించుకుంది. మంధాన నిరుడు 31.87 సగటుతో 255 పరుగులు చేసి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టింది. దీంతో 25 ఏళ్ల మంధాన ప్రతిభను గుర్తిస్తూ ఐసీసీ ఆమెను టీ20 జట్టుకు ఎంపిక చేసింది. 11 మంది సభ్యులు గల ఈ మహిళల జట్టుకు నాట్ స్ర్కివర్ (ఇంగ్లండ్) కెప్టెన్గా ఎంపికైంది.
పురుషుల జట్టులో భారత క్రికెటర్కు నో చాన్స్: కాగా, ఐసీసీ ప్రకటించిన పురుషుల టీ20 జట్టులో ఒక్క భారత క్రికెటర్కు కూడా చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ జట్టులో ముగ్గురు పాకిస్థాన్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్, షహీన్ అఫ్రీదికి చోటు దక్కింది. బాబర్ ఆజమ్ కెప్టెన్గా ఎంపికయ్యాడు.