ఘనంగా మండవ వారి ఆత్మీయ సమ్మేళనం

ABN , First Publish Date - 2022-01-17T07:00:21+05:30 IST

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెం దిన మండవ వారి వంశస్థుల ఆ త్మీయ సమ్మేళనం ఆదివారం ఒం గోలు నగరం త్రోవగుంట కంపెనీ ల వద్ద గల బృందావన కళావేది కలో ఘనంగా జరిగింది. ఈ సం దర్భంగా మండవ రమ, మండవ సుబ్బారావు వేడుకలకు అనుసం ధాన కర్తలుగా వ్యవహరించారు.

ఘనంగా మండవ వారి ఆత్మీయ సమ్మేళనం
ఆర్థికసాయం అందజేస్తున్న నిర్వాహకులు

ఒంగోలు(రూరల్‌) జనవరి 16: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెం దిన మండవ వారి వంశస్థుల ఆ త్మీయ సమ్మేళనం ఆదివారం ఒం గోలు నగరం త్రోవగుంట కంపెనీ ల వద్ద గల బృందావన కళావేది కలో ఘనంగా జరిగింది. ఈ సం దర్భంగా మండవ రమ, మండవ సుబ్బారావు వేడుకలకు అనుసం ధాన కర్తలుగా వ్యవహరించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ మండవ వంశస్థుల్లో పేదకుటుంబాలకు అండగా ఉండాలన్నారు. అంతేగాకుండా విద్యార్థులకు అవసరమైన ఆర్థికసాయం అందించాలని కోరారు. అనంతరం కాగా ప్రతిభ గల 25 మంది విద్యార్థుల చదువుల కోసం నగదు సాయం అందజేశారు. కాగా సమ్మేళనంలో మండల కుటుంబాలవారు ఆత్మీయంగా మాట్లాడుకుని యోగక్షేమాలు తెలుసుకు న్నారు. కార్యక్రమంలో ప్రముఖులు మండవ కుటుంబరావు, మండవ వెంకటరత్నం, గౌతమ్‌, మురళికృష్ణ, మండవ వెంకట్రావు, వెంకటమురళి, లక్ష్మీప్రసాద్‌, రంగారావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-17T07:00:21+05:30 IST