రూ.లక్ష వసూలు చేశారు

ABN , First Publish Date - 2022-08-08T05:15:47+05:30 IST

మండల సమాఖ్య భవనం మీదే.. భారం భరించండి అంటూ యానిమేటర్లను బాదేశారు.

రూ.లక్ష వసూలు చేశారు
తుది దశకు చేరిన మండల సమాఖ్య కార్యాలయ భవనం

మండల సమాఖ్య భవన నిర్మాణానికి బాదేశారు


ఆకివీడు, ఆగస్టు 7: మండల సమాఖ్య భవనం మీదే.. భారం భరించండి అంటూ యానిమేటర్లను బాదేశారు. ప్రభుత్వ నిధులు సరిపోవడం లేదని 46 మంది యానిమేటర్లు, సిబ్బంది నుంచి రూ.లక్ష వసూలు చేయడం చర్చ నీయాంశమైంది. మండల సమాఖ్య కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరడంతో గత ప్రభుత్వ హయాంలో తొలగించి నూతన భవన నిర్మాణానికి ప్రతిపానదలు చేశారు. 2018 ఫిబ్రవరిలో రూ.40 లక్షలు నిధులు మంజూరు చేశారు. స్లాబ్‌ వరకూ పనులు పూర్తి కాగా ప్రభుత్వ మారడంతో పనులు నిలిచిపోయాయి. 2021లో మండల పరిషత్‌ నుంచి రూ.10లక్షలు మంజూరు చేయడంతో గోడలు, బాత్‌రూమ్‌ పనులు చేయించారు. మిగిలిన మొత్తంప్రభుత్వం నుంచి నిధుల రాబట్టలేక అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు చిరుద్యోగుల నుంచి వసూలు చేయడంతో శోచనీయం.

Updated Date - 2022-08-08T05:15:47+05:30 IST