అయోధ్య కోసం, అమరావతి కోసం మందడం రైతుల పూజ

ABN , First Publish Date - 2020-08-05T22:45:04+05:30 IST

ఏ ఆటంకం లేకుండా అయోధ్యలో రామాలయం నిర్మాణం జరగాలని అదే విధంగా రాష్ట్రంలో మూడు రాజధానులు కాకుండా అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగాలని మందడం రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు

అయోధ్య కోసం, అమరావతి కోసం మందడం రైతుల పూజ

అమరావతి: ఏ ఆటంకం లేకుండా అయోధ్యలో రామాలయం నిర్మాణం జరగాలని అదే విధంగా రాష్ట్రంలో మూడు రాజధానులు కాకుండా అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగాలని మందడం రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొంత కాలంగా రాజధాని కోసం పోరాడుతున్న మందడం రైతులు.. రామాయల నిర్మాణ శంకుస్థాపన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ‘‘దశాబ్దాల కల సాకారమవుతోంది. అయోధ్యలో రామాలయం ఏ ఆటంకం లేకుండా పూర్తవ్వాలి. అదే విధంగా రాష్ట్రంలో అమరావతిని ఏకైక రాజధానిగా చేయాలి. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి’’ అని చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-08-05T22:45:04+05:30 IST