న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య సంధాన కర్తగా పనిచేసి రాష్ట్రానికి విరివిగానిధులు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తానని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందాజగన్నాధం(manda jagannadham) తెలిపారు.బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మందాజగన్నాధం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా(govt spl representative) భవన్ రెసిడెంట్ కమిషనర్ డా. గౌరవ్ ఉప్పల్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండోసారి తెలంగాణ ప్రత్యేక ప్రభుత్వ ప్రతినిధిగా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ అధికారులతో నిరంతరం సమావేశం అయి రాష్ట్ర ప్రభుత్వానికి విరివిగా నిధులు వచ్చేలా ప్రయత్నిస్తానని అన్నారు. అలాగే వివిధ ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు త్వరితగతిన వచ్చేలా ప్రయత్నిస్తానని అన్నారు. అంతే కాకుండా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను, పెండింగ్ ఇష్యూస్ ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గరకు తీసుకెళ్లేందుకు వెళ్తానని చెప్పారు. సుహృద్భావ వాతావరణంలో తనకర్తవ్యాన్ని నిర్వహిస్తానని మందాజగన్నాధం పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి