Manchu Vishnu Fire: ట్రోల్స్పై సీరియస్.. ఓ హీరో టార్గెట్ చేశాడంటూ ఆగ్రహం
ABN , First Publish Date - 2022-09-28T03:12:32+05:30 IST
సోషల్ మీడియా (Social Media)లో తనపై, తన కుటుంబపై ట్రోలింగ్ చేస్తున్న వారిపై హీరో మంచు విష్ణు (Manchu Vishnu) ఘాటుగా స్పందించారు. కొంతకాలంగా ...
హైదరాబాద్ (Hyderabad): సోషల్ మీడియా (Social Media)లో తనపై, తన కుటుంబపై ట్రోలింగ్ చేస్తున్న వారిపై హీరో మంచు విష్ణు (Manchu Vishnu) ఘాటుగా స్పందించారు. కొంతకాలంగా ఆయనపై కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ (Trolls)పై సీరియస్ అయ్యారు. ట్రోల్స్ ఇకపై సహించేది లేదని.. టాలీవుడ్లో ఓ హీరోకు చెందిన కంపెనీ నుంచే తన కుటుంబంపై ట్రోలింగ్ జరుగుతోందని మంచు విష్ణు మండిపడ్డారు. తనపైనా, తన కుటుంబంపైనా పని గట్టుకుని ట్రోలింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్వరలోనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఓ హీరో తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేశాడని ఆరోపించారు. తన కుటుంబంపై ట్రోలింగ్ చేసేందుకు జూబ్లిహిల్స్లోని ఓ హీరోకు చెందిన కంపెనీలో ఏకంగా 21 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని చెప్పారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే పూర్తి వివరాలు సేకరించానని స్పష్టం చేశారు. ఆ హీరో నడుపుతున్న ఆఫీస్ చిరునామాతో పాటుగా వారు వినియోగించే ఐపీ అడ్రస్లను కూడా సేకరించానని పేర్కొన్నారు. త్వరలోనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమగ్ర ఆధారాలతో ఫిర్యాదు చేస్తానని మంచు విష్ణు తెలిపారు.