Telanganaలో Bjp జెండా ఎగురవేయడం ఖాయం: అన్నపూర్ణ దేవి
ABN , First Publish Date - 2022-07-01T04:02:14+05:30 IST
Manchiryala పట్టణంలో బీజేపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి (Central Minister Annapurna) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ..
మంచిర్యాల: Manchiryala పట్టణంలో బీజేపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి (Central Minister Annapurna) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఆవాస్ యోజనను సీఎం కేసీఆర్ (Cm Kcr)అడ్డుకున్నారన్నారు. ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat)లో చేరలేదని మండిపడ్డారు. జాతీయ సంక్షేమ పథకాలను కేసీఆర్ పేదలకు అందకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యం కోసం పేదలు భూములు అమ్ముకునేలా చేస్తున్నారని ఆరోపించారు. మోదీ సభను ప్రజలు విజయవంతం చేస్తారని, తెలంగాణ (Telangana)లో బీజేపీ (Bjp) జెండా ఎగురవేయడం ఖాయమని అన్నపూర్ణ దేవి ధీమా వ్యక్తం చేశారు.