Telangana: ఇందారం-1ఏ బొగ్గు గనిపై మావోయిస్టు పోస్టర్ కలకలం

ABN , First Publish Date - 2021-12-16T15:22:35+05:30 IST

జిల్లాలోని ఇందారం-1ఏ బొగ్గు గనిపై మావోయిస్టు పోస్టర్ కలకలం రేపుతోంది.

Telangana: ఇందారం-1ఏ బొగ్గు గనిపై మావోయిస్టు పోస్టర్ కలకలం

మంచిర్యాల: జిల్లాలోని ఇందారం-1ఏ బొగ్గు గనిపై మావోయిస్టు పోస్టర్ కలకలం రేపుతోంది. గని అధికారులను, పలువురు కార్మికులను హెచ్చరిస్తూ మావోయిస్టు మంగిలాల్  పేరిట పోస్టర్ వెలిసింది. అవినీతికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోస్టర్‌లో పలువురి పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. అయితే పోస్టర్ వేసింది మావోయిస్టులు కాదని పోలీసులు భావిస్తున్నారు. 

Updated Date - 2021-12-16T15:22:35+05:30 IST