సమాజంలోని పరిస్థితులను ‘మనసున్నోడు’లో చూపించారు: రామకృష్ణ
ABN , First Publish Date - 2022-06-14T17:28:57+05:30 IST
సమాజంలోని పరిస్థితులను మనసుసున్నోడు సినిమాలోచూపించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
విజయవాడ: సమాజంలోని పరిస్థితులను మనసున్నోడు సినిమాలో చూపించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. మంగళవారం ఈ సినిమా ట్రెయిలర్ని రామకృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విశ్వ జాగృతి మూవీస్ బ్యానర్పై తెరకెక్కించారని చెప్పారు.ముంబైలో స్థిరపడి ప్రేమ వివాహం చేసుకున్న తమిళ మహిళ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారన్నారు.ఓటీటీ, థియేట్రికల్ రిలీజ్ ఉంటుందన్నారు.ఈ చిత్రం విజయవంతం కావడానికి నిర్మాతలు సహకరించాలని కోరారు.తమిళనాడు డైరెక్టర్ జ్ఞానవేలు తీసిన ‘జై భీమ్’ ప్రజల మన్ననలు పొందిందని చెప్పారు. అదే విధంగా ప్రజానాట్య మండలి నాటకాన్ని మనసున్నోడు చిత్రంగా తీశారన్నారు.సమాజంలో జరుగుతున్న ఘటనల ఆధారంగా తీసిన సినిమాని అందరూ ఆదరించాలని రామకృష్ణ కోరారు.