నలందలో ముగిసిన బ్రెయిన్ స్ట్రోమర్స్-2022
ABN , First Publish Date - 2022-05-18T06:21:57+05:30 IST
నలందలో ముగిసిన బ్రెయిన్ స్ట్రోమర్స్-2022
నలందలో ముగిసిన బ్రెయిన్ స్ట్రోమర్స్-2022
లబ్బీపేట, మే 17: విద్యార్థులు తమ కెరీర్ను ఉన్నతంగా మలచుకునేందుకు కృషి చేయాలని డిస్ట్రిక్ట్ జడ్జి డాక్టర్ ఎస్.రజనీ (పోక్సో కోర్టు)కోరారు. ఎంజీ రోడ్డులోని నలంద డిగ్రీ కళాశాలలో మేనేజ్మెంట్ అండ్ కామర్స్ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న మేనేజ్మెంట్ మీట్ ‘బ్రెయిన్ స్ట్రోమర్స్-2022’ మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ పోటీల్లో గెలుపోటములు సమానంగా తీసుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ మండవ అనురాధ మాట్లాడుతూ విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇదో చక్కని వేదికన్నారు. మేనేజ్మెంట్ విభాగం హెచ్వోడీ వై.శ్రీలక్ష్మీ మాట్లాడుతూ క్విజ్, యాడ్ మేకింగ్, బిజినెస్ ప్లాన్, డ్యాన్స్, గ్రూప్ డిస్కషన్, ప్రొడక్ట్ లాంచింగ్, యంగ్ మేనేజర్ తదితర పోటీలు నిర్వహించామన్నారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల డ్యాన్స్ ప్రోగ్రామ్ ఆకట్టుకుంది.