‘మన ఊరు-మన బడి’ పనులను సకాలంలో పూర్తిచేయాలి
ABN , First Publish Date - 2022-05-25T05:17:01+05:30 IST
‘మన ఊరు-మన బడి’ పనులను సకాలంలో పూర్తిచేయాలి
- వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్, మే 24 : ‘మన ఊరు-మన బడి’ పనులను వేగవంతం చేసి జూన్ 2 నాటికి మండలానికి రెండు పాఠశాలల చొప్పున పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక డీపీఆర్సీ భవనంలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా స్పెషల్ ఆఫీసర్లు, మండల విద్యాశాఖ అధికారులు, డీఈవోలు, ఏఈలతో మండలాల వారీగా సమీక్ష సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 30 లక్షల వ్యయం కన్నా తక్కువగా ఉన్న పాఠశాలల నిర్మాణం, సుందరీకరణ పనులకు సాంకేతిక, పరిపాలన అనుమతులను ఆమోదించుకొని నిర్మాణపు పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. ప్రతి మండలానికి రె ండు పాఠశాలల చొప్పున.. జూన్ 2 నాటికి పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలన్నారు. రూ.30 లక్షలకు ఎక్కువగా అయ్యే పాఠశాలల్లో గ్రౌండింగ్ పనులు ప్రారంభించాలని.. వెంటనే టెండర్ ప్రక్రియ మొదలుపెట్టాలని సూచించారు. ఈ విషయంలో స్పెషల్ ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి నాణ్యతతో కూడిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి, వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి, స్పెషల్ ఆఫీసర్లు ఎంఈవోలు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.