స్నేహితుడితో కలిసి రెండో భార్యను చంపేసిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ABN , First Publish Date - 2022-05-26T11:08:09+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో భయంకరమైన ఘటన వెలుగు చూసింది. ఉత్తర ఢిల్లీలోని నరేలా ప్రాంతంలోని గవర్నమెంట్ స్కూల్ పక్కన ఉన్న పొదల్లో ఒక గుర్తుతెలియని మహిళ మృతదేహం కనిపించింది. దాంతో స్థానికంగా కలకలం రేగింది...

స్నేహితుడితో కలిసి రెండో భార్యను చంపేసిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

దేశ రాజధాని ఢిల్లీలో భయంకరమైన ఘటన వెలుగు చూసింది. ఉత్తర ఢిల్లీలోని నరేలా ప్రాంతంలోని గవర్నమెంట్ స్కూల్ పక్కన ఉన్న పొదల్లో ఒక గుర్తుతెలియని మహిళ మృతదేహం కనిపించింది. దాంతో స్థానికంగా కలకలం రేగింది. 


ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి, మృతురాలిని మమత అనే మహిళగా గుర్తించారు. ఈ క్రమంలో ఆమె గురించి చెప్పేందుకు ముందుకొచ్చిన రాకేష్ అనే వ్యక్తి... మమత భర్త రిషి, అతని మొదటి భార్య బేబీని అనుమానాస్పదంగా చూశానని చెప్పాడు. ఏప్రిల్ 17న వాళ్లను చూశానని, వాళ్ల తత్తరపాటు చూసి ఏమైందని అడగ్గా.. ఏవో కుంటిసాకులు చెప్పారని రాకేష్ వెల్లడించాడు. ఆ మరుసటి రోజు రిషి పనికి రాలేదని, కారణం అడిగితే ఒంట్లో బాగలేదన్నాడని వివరించాడు. అదే సమయంలో అతని మొదటి భార్య గురించి ఎవరు అడిగినా.. తను పుట్టింటికి వెళ్లిపోయిందని చెప్పడం మొదలు పెట్టాడు రిషి. 


అయితే మరోసారి రాకేష్‌కు ఫోన్ చేసిన అతను.. మాటల మధ్యలో తన నేరం ఒప్పుకున్నాడని రాకేష్ తెలిపాడు. కరణ్ అనే స్నేహితుడితో కలిసి మొదటి భార్య మమతను గొంతుపిసికి చంపినట్లు రిషి అంగీకరించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రిషితోపాటు అతని రెండో భార్య బేబీ (36), స్నేహితుడు కరణ్ (22)ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2022-05-26T11:08:09+05:30 IST