హత్య కేసులో వాంటెడ్ వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

ABN , First Publish Date - 2022-05-08T20:45:50+05:30 IST

ఒక హత్య కేసులో పరారీలో ఉన్న వ్యక్తి ఆదివారంనాడు ఓ బ్రిడ్జి నుంచి కోవై..

హత్య కేసులో వాంటెడ్ వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

తెలియముర: ఒక హత్య కేసులో పరారీలో ఉన్న వ్యక్తి ఆదివారంనాడు ఓ బ్రిడ్జి నుంచి కోవై నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే తృటిలో ప్రాణాపాయం తప్పి ఆసుపత్రి పాలయ్యాడు. త్రిపురలోని కోవై జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.


అనూప్ సూత్రధార్ (29) అనే వ్యక్తిని కొందరు నరికి చంపిన కేసులో పరితోష్ సూత్రధార్ నిందితుడు. శుక్రవారం రాత్రి డీఎం కాలనీలో కొందరు అనూప్‌పై దాడి చేశారు. తీవ్రరక్తస్రావం జరగడంతో అతన్ని రోడ్డు పక్కనే పడేసి దుండగులు పారిపోయారు. స్థానికులు అతనిని తెలియముర ఆసుపత్రికి తరలించి, పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అక్కడి నుంచి అగర్తలలోని జీబీపీ ఆసుపత్రిలో చేర్చారు. తీవ్రగాయాలలో శనివారం ఉదయం అనూప్ కన్నుమూశాడు. అతని హత్య కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేయగా, పరారీలో ఉన్న పరితోష్ శనివారం బ్రిడ్జిపై నుంచి కోవా నదిలో దూకాడు. అయితే, ప్రాణాలతో బయటపడిన అతన్ని ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని సబ్ డివిజనల్ పోలీస్ అధికారి సోనాచరణ జమాతియా తెలిపారు.  అనూప్‌ హత్యకు గల కారణాలపై ప్రస్తుతం విచారణ జరుగుపుతున్నట్టు ఆయన చెప్పారు.

Read more