రైల్లో అండర్‌వేర్‌తో తిరుగుతూ హడలెత్తించిన వ్యక్తి.. అతడెవరో తెలిసి ప్రయాణికులంతా సైలెంట్.. రాజకీయ కలకలం..!

ABN , First Publish Date - 2021-09-03T18:03:34+05:30 IST

దేశ రాజధానికి బయలుదేరిందా రైలు. ఏసీ కోచ్ కావడంతో అంత హడావుడి లేదు. ఇంతో ఒక వ్యక్తి లేచి బాత్రూంకు వెళ్లాడు. తిరగొచ్చేసిరికే పక్క సీట్లోని వ్యక్తి దుస్తులు విప్పేసి, బనియన్, అండర్‌వేర్‌పై కనిపించాడు.

రైల్లో అండర్‌వేర్‌తో తిరుగుతూ హడలెత్తించిన వ్యక్తి.. అతడెవరో తెలిసి ప్రయాణికులంతా సైలెంట్.. రాజకీయ కలకలం..!

ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధానికి బయలుదేరిందా రైలు. ఏసీ కోచ్ కావడంతో అంత హడావుడి లేదు. ఇంతో ఒక వ్యక్తి లేచి బాత్రూంకు వెళ్లాడు. తిరగొచ్చేసిరికే పక్క సీట్లోని వ్యక్తి దుస్తులు విప్పేసి, బనియన్, అండర్‌వేర్‌పై కనిపించాడు. అది చూసి షాకైపోయినా.. గొడవ చేయకుండా సైలెంట్‌ అయిపోయాడు. అయితే కొంచెం దూరంలో ఉన్న ప్రహ్లాద్ పాసవాన్ అనే మరో ప్రయాణికుడు తన కోపాన్ని అణుచుకులేకపోయాడు. ‘‘ఇక్కడ ఆడవాళ్లు కూడా ఉన్నారు. మర్యాదగా ప్రవర్తించండి’’ అంటూ అరిచాడు. అప్పుడైనా తన తప్పు తెలుసుకొని క్షమాపణలు చెప్పాల్సిన సదరు అండర్‌వేర్ ప్రయాణికుడు.. అలాంటి పని చేయకుండా గొడవకు దిగాడు. దీంతో ప్రహ్లాద్ అధికారులను పిలిచి ఫిర్యాదు చేశారు. అక్కడకు చేరుకున్న ఆర్పీఎఫ్, టీటీఈ అధికారులు ఆ ఏసీ కోచ్‌కు వచ్చి.. అండర్‌వేర్‌పై ఉన్న వ్యక్తిని చూసి కంగుతిన్నారు. ఎందుకంటే ఆయన బిహార్ ఎమ్మెల్యే! ఈ ఘటన పట్నా నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌‌లో వెలుగు చూసింది.


బిహార్‌లో అధికార పార్టీ జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) ఎమ్మెల్యే గోపాల్ మండల్.. ఢిల్లీ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే రాజధాని ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. ఆ సమయంలోనే దుస్తులన్నీ విప్పేసి కేవలం బనియన్, అండర్‌వేర్‌పై కనిపించారు. దీనిపై ప్రయాణికులు గోల చేశారు. వారితో గోపాల్ కూడా గొడవకు దిగారు. విషయం తెలిసి అక్కడకు వచ్చిన అధికారులు.. రెండు వర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత గోపాల్ మండల్.. తన ఏ1 కోచ్ సీట్లోకి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన ఒక ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో చాలా మంది గోపాల్‌ చర్యను తప్పుబడుతున్నారు. అయితే గోపాల్ మండల్ మాత్రం తనను తాను సమర్థించుకున్నారు. తనకు కడుపులో బాగలేదని, అందుకే దుస్తులు విప్పానని చెప్పారు. ఏది ఏమైనా రైల్లో ఒక ఎమ్మెల్యే ఇలా చేయడం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2021-09-03T18:03:34+05:30 IST