మ్యాట్రిమోనీలో యవతికి పరిచయమైన బిజినెస్మేన్.. వివాహం తరువాత అతడు ఆమెను ఎలా ఉపయోగించుకున్నాడంటే..
ABN , First Publish Date - 2022-01-19T09:16:00+05:30 IST
మ్యాట్రిమోనీ వెబ్సైట్లో పరిచయమైన ఒక బిజినెస్మేన్ని ఆ యువతి ప్రేమించి వివాహం చేసుకుంది. పెళ్లైన కొన్ని రోజుల తరువాత నుంచి భర్త ఆమెను పలు రకాల చిత్రహింసలు పెట్టాడు. ఆమెను తీసుకొని బడాపార్టీలకు వెళ్లాడు. తన భార్యను ఆ దుర్మార్గుడు స్నేహితుల వద్దకు పంపాడు...
మ్యాట్రిమోనీ వెబ్సైట్లో పరిచయమైన ఒక బిజినెస్మేన్ని ఆ యువతి ప్రేమించి వివాహం చేసుకుంది. పెళ్లైన కొన్ని రోజుల తరువాత నుంచి భర్త ఆమెను పలు రకాల చిత్రహింసలు పెట్టాడు. ఆమెను తీసుకొని బడాపార్టీలకు వెళ్లాడు. తన భార్యను ఆ దుర్మార్గుడు స్నేహితుల వద్దకు పంపాడు. ఆమె వినకపోతే కొట్టేవాడు. చివరికి ఆమెతో ఇక అవసరం తీరిపోయిందనుకున్నాక వదిలేశాడు. ఆ యువతి తన పుట్టింటికి తిరిగొచ్చి ప్రాణభయం ఉన్నా ధైర్యం కూడగట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్లలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బేమెతరా జిల్లాకు చెందిన షీలా(26)కు ఒక మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా మధ్యప్రదేశ్ ఇందోర్ నగరానికి చెందిన ఒక బడా బిల్డర్ రాజేశ్ విశ్వకర్మ అనే యువకుడు పరిచయమయ్యాడు. అతడి ఆస్తి, అందం చూసి షీలా వివాహం చేసుకుంది. వివాహం తరువాత రాజేశ్ తన భార్యను తీసుకొని మధ్యప్రదేశ్లోని ఇందోర్ తీసుకువెళ్లాడు. అక్కడ కొన్ని రోజులపాలు అంతా బాగానే ఉంది. కానీ కొన్ని రోజుల తరువాత రాజేశ్ భార్యను కొట్టడం ప్రారంభించాడు. తను చెప్పింది వినకపోతే ఆమె శరీరమంతా సిగరెట్లతో కాల్చేవాడు. భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక షీలా అతడి మాటలకు ఒప్పుకుంది.
ఆ తరువాత నుంచి రాజేశ్ తన భార్య షీలాను తన స్నేహితుల వద్దకు తీసుకొన్ని వెళ్లేవాడు. వారంతా ఆమెపై అత్యాచారం చేశారు. ఇలా షీలా శరీరాన్ని రాజేశ్ తన వ్యాపార మిత్రులకు సంతృప్తిపరిచేందుకు ఉపయోగించుకున్నాడు. ఒకరోజు షీలా భర్త చెప్పిన దానికి అంగీకరించపోతే ఆమె శరీరంపై ముఖ్యంగా జననాంగాలపై సిగరెట్లో కాల్చాడు. దీంతో షీలా తన భర్త అంటే చాలా భయపడేది. ఇలా కొంతకాలం తరువాత షీలాతో అవసరం తీరిపోయిందనుకున్నాక రాజేశ్ ఆమెను ఛత్తీస్ గఢ్ తన పుట్టింటికి పంపించేశాడు. కానీ వెళ్లేటప్పుడు కత్తి చూపించి ఆమెపై జరిగిన అత్యాచారాల గురించి నోరు విప్పకూడదని బెదిరించాడు.
షీలా తన పుట్టింటికి చేరుకొని కొన్ని రోజుల తరువాత తనపై జరిగిన అత్యాచారాల గురించి కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆ తరువాత పోలీసులకు రాజేశ్పై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో ఆమె పేర్కొన్న ఆరోపణలు తీవ్రంగా ఉండడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. బిల్డర్ రాజేశ్, అతని ఇద్దరు మిత్రులను అరెస్టు చేశారు. అత్యాచార నిందితులలో ఇంకా నలుగురు పరారీలో ఉన్నారు.