27 ఏళ్ల భార్య రహస్యంగా ఎవరితోనో ఫోన్లో మాట్లాడటాన్ని చూసిన ఆ భర్తలో ఒకటే టెన్షన్.. చివరకు అతడి నిర్వాకమిదీ..!

ABN , First Publish Date - 2021-10-17T07:55:06+05:30 IST

భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఊహించని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె ఎవరితోనే ఫోన్‌లో మాట్లాడుతుండడంతో..

27 ఏళ్ల భార్య రహస్యంగా ఎవరితోనో ఫోన్లో మాట్లాడటాన్ని చూసిన ఆ భర్తలో ఒకటే టెన్షన్.. చివరకు అతడి నిర్వాకమిదీ..!

జైపూర్: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఊహించని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె ఎవరితోనే ఫోన్‌లో మాట్లాడుతుండడంతో పరాయి వ్యక్తితో భార్య సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఏకంగా గొడ్డలితో దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


సర్దార్‌షెహర్ ఏఎస్‌ఐ హిమ్మత్ సింహ్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక చూరూ జిల్లాలోని సర్దార్‌షెహర్‌‌లో ఉన్న జమీదార్ కాలనీలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు పూజా(27) మాలికి 10ఏళ్ల క్రితం నిందితుడు శ్యామ్‌లాల్‌తో జరిగింది. అప్పటి నుంచి భర్త, అత్త ఇద్దరూ నానా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. ఈ మధ్యనే భర్త  తనపై చేయి చేసుకోవడంతో పూజ పుట్టింటికి వెళ్లిపోయింది. 10 రోజుల క్రితమే శ్యామ్‌లాల్ అక్కడకు వెళ్లి పూజను ఇకపై కొట్టనని ఆమె తండ్రికి హామీ ఇచ్చి ఇంటికి తెచ్చుకున్నాడు శ్యామ్‌లాల్. కానీ ఇంటికి వచ్చిన తరువాత మళ్లీ ఎప్పటిలానే ఇబ్బందులు పెట్టేవాడు. ఆమె వద్ద ఫోన్‌ ఉంటే ఎవరితోనే మాట్లాడుతోందని అనుమానించిన శ్యామ్‌లాల్ ఫోన్ తీసేసుకున్నాడు. అయితే గత శుక్రవారం పని ముగించుకుని ఇంటికొచ్చిన శ్యామ్‌లాల్.. భార్య చేతిలో మరో ఫోన్ చూశాడు. వెంటనే అతడికి పట్టరాని కోపం వచ్చింది. 


‘ఈ ఫోన్ ఎక్కడిద’ని భార్యను నిలదీశాడు. తన తండ్రి ఇచ్చాడని ఆమె చెప్పినా.. వినిపించుకోకుండా అక్కడే ఉన్న గొడ్డలితో ఆమెపై దాడి చేశాడు. కాళ్లపై, భుజాలపై తీవ్రంగా గాయపరిచాడు. వెంటనే అక్కడినుంచి పారిపోయాడు. స్థానికులు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. పూజను వెంటనే 108 ఆంబులెన్స్‌లో రాజకీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన డాక్టర్లు.. మెరుగైన చికిత్స కోసం పెద్దాసుపత్రికి రిఫర్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందుతుడు శ్యామ్‌లాల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


Updated Date - 2021-10-17T07:55:06+05:30 IST