భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని అనుమానించిన భర్త.. ఆమెపై యాసిడ్ పోసి ఎక్కడికి తీసుకెళ్లాడంటే.. చివరకు

ABN , First Publish Date - 2022-04-14T08:31:14+05:30 IST

అనుమానం పెనుభూతం అంటారు.. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానం పెంచుకున్న భర్త దారుణానికి తెగించాడు.. ఆమెపై యాసిడ్ పోశాడు.. తీవ్రంగా గాయపడిన భార్యను ఆమె తండ్రి ఇంటి ముందు పడేసి పారిపోయాడు.. ప్రస్తుతం ఆ మహిళ హాస్పిటల్‌లో ప్రాణాలతో పోరాడుతోంది...

భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని అనుమానించిన భర్త.. ఆమెపై యాసిడ్ పోసి ఎక్కడికి తీసుకెళ్లాడంటే.. చివరకు

అనుమానం పెనుభూతం అంటారు.. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానం పెంచుకున్న భర్త దారుణానికి తెగించాడు.. ఆమెపై యాసిడ్ పోశాడు.. తీవ్రంగా గాయపడిన భార్యను ఆమె తండ్రి ఇంటి ముందు పడేసి పారిపోయాడు.. ప్రస్తుతం ఆ మహిళ హాస్పిటల్‌లో ప్రాణాలతో పోరాడుతోంది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 


పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాకు చెందిన జ్యోతిష్ మండల్ అనే వ్యక్తి వృత్తి రీత్యా బట్టల వ్యాపారి. అతనికి 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వివాహమైన నాటి నుంచి అతను భార్యను అనుమానిస్తూనే ఉన్నాడు. ఆమెకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అంటూ తరచుగా గొడవ పడేవాడు. ఆ అనుమానం రోజురోజుకూ మరింత పెరిగింది. దీంతో ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. 


ఆమె మొహంపై యాసిడ్ పోసేశాడు. అనంతరం ఆమెను ఆమె తండ్రి ఇంటి ముందు పడేసి పరారైపోయాడు. దాడిలో ఆ మహిళ మొహం అంతా కాలిపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాలతో పోరాడుతోంది. సమాచారం అందుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలి భర్తను అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-04-14T08:31:14+05:30 IST