భోజనం చేశాక ఐదు రూపాయలు ఇవ్వలేదని....

ABN , First Publish Date - 2021-09-13T12:46:20+05:30 IST

ఒడిశాలోని ఒక హోటల్ యజమాని... వినియోగదారుడు...

భోజనం చేశాక ఐదు రూపాయలు ఇవ్వలేదని....

కెందుఝార్: ఒడిశాలోని ఒక హోటల్ యజమాని... వినియోగదారుడు కేవలం ఐదు రూపాయలు ఇవ్వలేదని అతనిని చావగొట్టాడు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కెందుఝార్ పరిధిలోని పోదాఖ్మానా గ్రామంలో జితేంద్ర దెహురీ అనే వ్యక్తి భోజనం చేసేందుకు హోటల్‌కు వెళ్లాడు. భోజనం చేశాక బిల్లు చెల్లించే సమయంలో రూ. 45కు బదులు తన దగ్గరున్న రూ. 40 ఇచ్చాడు. బిల్లు చెల్లింపులో ఐదు రూపాయలు తక్కువ ఇవ్వడంతో హోటల్ యజమాని ఆగ్రహంతో ఊగిపోతూ అతనిపై పిడిగుద్దులు కురిపించాడు. బాధితుడు టీ దుకాణం నిర్వహిస్తుంటాడు. 


మీడియాకు అందిన సమాచారం ప్రకారం జితేంద్ర దెహురి భోజనం చేసేందుకు ‘మా హోటల్’కు వెళ్లాడు. భోజనం చేశాక హోటల్ యజమాని మధుసాహు అతనికి రూ. 45 మేరకు అయిన బిల్లు ఇస్తూ, గతంలో చెల్లించాల్సిన రూ. 100 బకాయి తీర్చమన్నాడు. అయితే జితేంద్ర దగ్గర 40 రూపాయలు మాత్రమే ఉండటంతో ఆ మెత్తాన్ని ఇచ్చాడు. అయితే మధుసాహు భోజనానికి రూ. 45 చెల్లించాలని అన్నాడు. మిగిలిన ఐదు రూపాయలు వెంటనే ఇవ్వాలని కోరాడు. ఐదు రూపాయలు తన దగ్గర లేవని జితేంద్ర చెప్పడంతో హోటల్ యజమాని, అతని కుమారుడు... ఇద్దరూ కలిసి జితేంద్రను చావబాదారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-09-13T12:46:20+05:30 IST