మదనపల్లెలో తమిళనాడు వాసి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-10-28T13:04:13+05:30 IST
తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి మదనపల్లెలో ఉరేసుకున్నాడు. మదనపల్లె తాలూకా పోలీసుల కథనం మేరకు... తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా సాంబల్లికి చెందిన పి.నగేష్(42) ఇరవై రోజుల కిందట స్నేహితులతో కలసి ఉపాధి
మదనపల్లె(అమరావతి): తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి మదనపల్లెలో ఉరేసుకున్నాడు. మదనపల్లె తాలూకా పోలీసుల కథనం మేరకు... తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా సాంబల్లికి చెందిన పి.నగేష్(42) ఇరవై రోజుల కిందట స్నేహితులతో కలసి ఉపాధి నిమిత్తం మదనపల్లెకు వచ్చాడు. మండలంలోని కోటవారిపల్లె సమీపంలోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో డ్రిల్లర్గా పనిచేస్తున్నాడు. కాగా భార్య మరియమ్మ ఏడాది కిందట భర్తతో గొడవపడి తన ఇద్దరు పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది. ఈనేపథ్యంలో కోర్టులో కేసువేసి ఇటీవల విడాకులు తీసుకుంది. దీంతో నగేష్ కొద్ది రోజులుగా మనోవేదనతో బాధపడుతూ మంగళవారం రాత్రి ఫ్యాక్టరీ సమీపంలోని మామిడితోటలోకి వెళ్లి పంచెతో చెట్టుకు ఉరేసుకున్నాడు. బుధవారం స్థానికులు గమనించి ఫ్యాక్టరీ సిబ్బందికి, తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దింపి, ఘటనపై తమిళ కూలీలను విచారించారు. భార్యాపిల్లలు దూరమయ్యారనే బాధతో ఆత్మహత్య చేసుకున్నాడని వారు చెప్పారు. అనంతరం ఘటనపై నగేష్ కుటుంబీకులకు సమాచారం అందించారు. ఈక్రమంలో మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సోమశేఖర్ చెప్పారు.