స్నేహితుడికి ఫోన్చేసి ఉరేసుకున్న యువకుడు
ABN , First Publish Date - 2022-08-20T05:20:52+05:30 IST
కుటుంబ కలహాలతో ఉరి వేసుకుని వ్యక్తి మృతిచెందిన సంఘటన గురువారం రాత్రి జరిగింది. పోలీసులు,
ఉలవపాడు, ఆగస్టు 19 : కుటుంబ కలహాలతో ఉరి వేసుకుని వ్యక్తి మృతిచెందిన సంఘటన గురువారం రాత్రి జరిగింది. పోలీసులు, వీఆర్వో కథనం మేరకు చాగల్లు బీసీ కాలనీకి చెందిన జంపాని వెంకటకృష్ణ(30) గురువారం రాత్రి 11.30 సమయంలో అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడికి ఫోన్ చేసి తాను చనిపోతున్నానని చెప్పాడు. దీంతో హుటాహుటిన వచ్చిన స్నేహి తుడు కుటుంబసభ్యులతో కలిసి వెంకటకృష్ణ ఉన్న గది తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. కొన ఊపిరితో ఉండగా 108లో ఉలవపాడు సీహెచ్సీకి తీసుకువచ్చారు. మెరుగైన వైద్యం కోసం పక్క మండలమైన సింగరాయకొండ ప్రైవే టు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. మృతుడికి భార్య, 5 ఏళ్ల కుమారుడు ఉన్నారు. స్థానిక వీఆర్వో శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై త్యాగరాజు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటంబసభ్యులకు అప్పగించారు.
============================