వ్యక్తి ముఖంపై కాల్పులు జరిపిన Juvenile...నలుగురి అరెస్టు

ABN , First Publish Date - 2022-07-16T22:41:26+05:30 IST

శాన్య ఢిల్లీలో జహంగరిర్‌పురి ప్రాంతంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలుడు 36 ఏళ్ల వ్యక్తి ముఖంపై..

వ్యక్తి ముఖంపై కాల్పులు జరిపిన Juvenile...నలుగురి అరెస్టు

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో జహంగరిర్‌పురి ప్రాంతంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలుడు (Juvenile) 36 ఏళ్ల వ్యక్తి ముఖంపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న నలుగురు మైనర్ బాలురను పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై హత్యాయత్నం కింద జహంగీర్‌పురి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. వారి నుంచి ఒక నాటుతుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితుడు పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.


సంఘటన వివరాల ప్రకారం, శుక్రవారం సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో జహంగీర్‌పురి ప్రాంతంలో జావెద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపినట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే గాయపడిన జావేద్‌ను స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లి, అక్కడి నుంచి మరో వైద్యకేంద్రానికి తరలించారు. జావెద్ కుడికంటికి బుల్లెట్ గాయమైంది. మధ్యాహ్నం 4.45 గంటల ప్రాంతంలో పార్క్ సమీపంలో తాను కూర్చుని ఉండగా ముగ్గురు మైనర్ బాలురు అక్కడకు వచ్చారని, వారిలో ఒకడు తన ముఖంపై కాల్పులు జరిపాడని విచారణలో జావెద్ చెప్పినట్టు డీసీపీ ఉష తెలిపారు. కాగా, తన తండ్రిని ఏడునెలల క్రితం జావేద్ కొట్టాడని, అందుకు ప్రతీకారంగా తాను కాల్పులు జరిపినట్టు నిందితులలో ఒకరు వెల్లడించాడని ఆమె చెప్పారు.

Updated Date - 2022-07-16T22:41:26+05:30 IST