మైనర్‌పై అత్యాచారం చేసిన వ్యక్తికి 7 ఏళ్ల జైలు శిక్ష

ABN , First Publish Date - 2022-04-18T19:51:13+05:30 IST

2018 ఏప్రిల్ 17న 16 ఏళ్ల బాలిక తన ఇంటి నుంచి బయటికి వచ్చినప్పుడు.. తన బైక్‌పై రావాలని కోరాడట. అనంతరం ఆమెను కొండ సమీపంలో ఉన్న ఒక గదికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు విచారణలో తేలింది. ఏప్రిల్ 18న బాలిక తల్లిదండ్రులు..

మైనర్‌పై అత్యాచారం చేసిన వ్యక్తికి 7 ఏళ్ల జైలు శిక్ష

ముంబై: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ మహారాష్ట్రలోని భివండి ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నట్లు పోక్సో ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. అలాగే 8,000 రూపాయల జరిమానా సైతం విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. నిందితుడు గుడ్డు ఇస్త్రైల్ అన్సారీ(31) అని, 2018లో ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేశాడని కోర్టు ముందు రుజువైంది. మొత్తం తొమ్మిది మంది సాక్ష్యుల ఆధారంగా విచారణ కొనసాగింది.


2018 ఏప్రిల్ 17న 16 ఏళ్ల బాలిక తన ఇంటి నుంచి బయటికి వచ్చినప్పుడు.. తన బైక్‌పై రావాలని కోరాడట. అనంతరం ఆమెను కొండ సమీపంలో ఉన్న ఒక గదికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు విచారణలో తేలింది. ఏప్రిల్ 18న బాలిక తల్లిదండ్రులు.. ఆమెను కొండ సమీపంలోని గదిలో గుర్తించేంత వరకు అన్సారీ బంధీలోనే ఉందని కోర్టు తెలిపింది. ఇండియన్ పీనల్ కోడ్, పోక్సో చట్టంలోని అత్యాచారం, తప్పుడు నిర్బంధంతో సహా పలు ఆరోపణల కింద అన్సారీని కోర్టు దోషిగా నిర్ధారించి శిక్ష విధించింది.

Updated Date - 2022-04-18T19:51:13+05:30 IST