భార్యా, పిల్లలు ఉండగానే మరొకరితో వివాహం.. రహస్యంగా కాపురం పెట్టి..
ABN , First Publish Date - 2021-06-25T17:34:43+05:30 IST
భార్యా, పిల్లలు ఉండగా మరొకరితో ప్రేమాయణం కొనసాగించాడు. ఎవరికీ తెలియకుండా ...
హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్ : భార్యా, పిల్లలు ఉండగా మరొకరితో ప్రేమాయణం కొనసాగించాడు. ఎవరికీ తెలియకుండా యువతిని వివాహం చేసుకున్నాడు. రెండు నెలలు కాపురం చేసి ఆమెను బెదిరించాడు. తనను మోసం చేశాడంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. యూసు్ఫగూడ చెక్పోస్టులో నివసిస్తున్న ఎం. స్రవంతి ఐటీ రిక్రూటర్గా పనిచేస్తోంది. కొద్ది రోజుల క్రితం తన చిన్ననాటి స్నేహితుడు బి. సందీప్ ప్రసాద్ ఆమెను కలిశాడు. ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని అతడు ఆమెకు చెప్పాడు.
సందీప్కు ఐదేళ్ల క్రితమే వివాహం అయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో స్రవంతి అంగీకరించలేదు. భార్యకు విడాకులు ఇస్తానని చెప్పాడు. ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు కూడా తెలిపాడు. అందరూ వ్యతిరేకించడంలో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో స్రవంతి పెళ్లికి అంగీకరించింది. ఎవరికీ చెప్పకుండా ఆమెను నాలుగు నెలల క్రితం యాదగిరిగుట్ట తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. కుషాయిగూడలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. కొద్ది రోజులుగా స్రవంతిని గదిలోనే నిర్బంధించి బయటకు వెళ్లేవాడు. గత నెలలో సందీప్ ప్రసాద్ బంధువులు వచ్చి ఆమెను బెదిరించారు. ఈ నెల 16న ఆమెను బేగంపేట తీసుకెళ్లి మరోసారి బెదిరించడంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.