రైలు దూసుకొస్తోంది.. పట్టాలపై బాలుడు.. ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-04-19T20:29:39+05:30 IST

ముంబై: వేగంగా వస్తున్న రైలుకు ఎదురు వెళ్లడమంటే మృత్యు ముఖంలో తలదూర్చడమే..

రైలు దూసుకొస్తోంది.. పట్టాలపై బాలుడు.. ఏం జరిగిందంటే..

ముంబై: వేగంగా వస్తున్న రైలుకు ఎదురు వెళ్లడమంటే మృత్యు ముఖంలో తలదూర్చడమే.. ఆమడ దూరంలో రైలు కూత వింటేనే గుండె గుభేళ్‌మంటోంది. అలాంటిది ఓ వ్యక్తి వేగంగా దూసుకొస్తున్న రైలుకు ఎదురువెళ్లి మరీ ఓ చిన్నారి ప్రాణాలు కాపాడాడు. ముంబైలోని వాంఘాని రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. తండ్రీ కొడుకులు నడుచుకుంటు వెళుతుండగా బాలుడు కాలుజారీ రైలు పట్టాలపై పడిపోయాడు. ఇది గమనించిన రైల్వే మాన్.. ఎదురుగా రైలు వస్తున్నా.. ముందుకు పరుగెత్తుకుంటూ వెళ్లి బాలుడిని కాపాడాడు. దీంతో అందరూ ఆయనను ప్రశంసించారు. 

Updated Date - 2021-04-19T20:29:39+05:30 IST