USA: కూతురి వైద్యం కోసం ఇండియాకొచ్చిన అమెరికా మహిళ.. భారతీయుడితో పరిచయం.. ఆ తరువాత ఊహించని విధంగా..

ABN , First Publish Date - 2022-08-29T00:27:17+05:30 IST

తనపై అత్యాచారం చేశాడంటూ ఓ భారతీయుడిపై అమెరికా(America) మహిళ ఆరోపించింది. ఈ మేరకు బుధవారం గురుగ్రామ్(Gurugram) పోలీసులకు ఫిర్యాదు చేసింది.

USA: కూతురి వైద్యం కోసం ఇండియాకొచ్చిన అమెరికా మహిళ.. భారతీయుడితో పరిచయం.. ఆ తరువాత ఊహించని విధంగా..

ఎన్నారై డెస్క్: తనపై అత్యాచారం చేశాడంటూ ఓ భారతీయుడిపై అమెరికా(America) మహిళ ఆరోపించింది. ఈ మేరకు బుధవారం గురుగ్రామ్(Gurugram) పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. అమెరికాకు చెందిన ఓ మహిళ తన కూతురికి(11) వైద్యం చేయించేందుకు 2014లో భారత్‌కు వచ్చింది. ఆ తరువాత..గురుగ్రామ్‌లోని సౌత్‌సిటీ ప్రాంతంలో నివసించసాగింది. 


అయితే.. 2017లో ఆమెకు సోషల్ మీడియాలో సచిన్ కుమార్ పరిచయమయ్యాడు. కాలక్రమంలో వారి స్నేహితులయ్యారు. తరచూ కలుసుకుంటూ ఉండేవారు. సచిన్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరం. కాగా.. తనకు భార్యతో విబేధాలున్నాయంటూ సచిన్ ఓ సందర్భంలో అమెరికా మహిళకు చెప్పాడు. అంతేకాకుండా.. నగదు రూపంలో సాయం చేయాలని ఆమెను అడిగాడు. అయితే.. ఓ రోజున అతడను తనపై అత్యాచారం(Sexual assualt) చేసినట్టు ఆమె ఆరోపించింది.  ఫలితంగా తాను గర్భం దాల్చానని, అ తరువాత తనను వివాహం చేసుకుంటానని అతడి అప్పుడు హామీ కూడా ఇచ్చినట్టు పేర్కొంది. ఈ క్రమంలో తన నుంచి మొత్తం 13 లక్షలను మోసపూరితంగా తీసుకున్నట్టు తెలిపింది. 


తాను గర్భవతి అని తెలిసాక బలవంతంగా అబార్షన్ కూడా చేయించాడని కూడా చెప్పింది. ఈ కుట్ర వెనుక సచిన్ భార్య, తల్లి హస్తం కూడా ఉందని పేర్కొంది. ఆ తరువాత..తాను అతడికి బ్రేకప్ చెప్పానని వివరించింది. దీంతో.. అతడు తన నుంచి రూ.50 లక్షలు డిమాండ్ చేశాడని, అడిగిన డబ్బు ఇవ్వని పక్షంలో  వ్యక్తిగత ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ తనను బెదిరించాడని ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2022-08-29T00:27:17+05:30 IST