మా అక్కనే బాధపెడతావా.. అంటూ ఆ యువకుడు.. బావకు బద్ధి చెప్పడానికి చేసిన ఘోరం..

ABN , First Publish Date - 2021-10-29T12:53:48+05:30 IST

మనిషి తనకోసం కన్నా తను ప్రేమించే వారికోసం, తన ఆత్మీయుల కోసం ఎక్కువ ఆలోచిస్తాడు. ఒక్కోసారి వారి బాగుకోసం ఏమైనా చేస్తాడు. అలాంటి ఒక సంఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో జరిగింది...

మా అక్కనే బాధపెడతావా.. అంటూ ఆ యువకుడు.. బావకు బద్ధి చెప్పడానికి చేసిన ఘోరం..

మనిషి తనకోసం కన్నా తను ప్రేమించే వారికోసం, తన ఆత్మీయుల కోసం ఎక్కువ ఆలోచిస్తాడు. ఒక్కోసారి వారి బాగుకోసం ఏమైనా చేస్తాడు. అలాంటి ఒక సంఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో జరిగింది. 


భరత్‌పూర్‌కు చెందిన ప్రశాంతి(పేరు మార్చబడినది) ఇటీవల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనపై ఇద్దరు అత్యాచారం చేసి వీడియో తీశారని, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించి మళ్లీ పిలిచి అఘాయిత్యం చేశారని  ఏడుస్తూ ఫిర్యాదు చేసింది. అత్యాచారం చేసిన ఇద్దరు యువకులు ఆమెకు దూరపు బంధువులు. నిందితుల ఆచూకీ తెలుసుకొని పోలీసులు ఎలాగోలా పట్టుకున్నారు. వారిని విచారణ చేయగా.. ఆ నిందితులు చెప్పిన విషయం విని షాకయ్యారు. అసలేం జరిగిందంటే..


పోలీసుల కథనం ప్రకారం.. ప్రశాంతి అన్న మురళికి రాధతో(పేర్లు మార్చబడినవి) కొద్ది కాలం క్రితం వివాహమైంది. కానీ రాధను మురళి తరచూ హింసించేవాడు. అతను పెట్టే హింసను పుట్టింట్లో చెప్పుకొని రాధ ఏడ్చేది. అది చూసి రాధ తమ్ముడు పవన్ భరించలేకపోయాడు. తన బావకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం పవన్ తన స్నేహితుడు సౌరభ్ సహాయం తీసుకున్నాడు. 


ఒక రోజు ప్రశాంతి తన ఆఫీసులో ఉండగా.. తన అక్క ఆస్పత్రిలో ఉందని ఫోన్ వచ్చింది. ప్రశాంతి తన ఆఫీసు నుంచి బయటకు వచ్చి బస్ కోసం ఎదురు చూస్తూ ఉండగా.. పవన్ తన స్నేహితుడు సౌరభ్‌తో అక్కడికి వచ్చాడు. ప్రశాంతిని పలకరించి తాను బైక్‌పై తీసుకెళ్తానని చెప్పాడు. వదిన తమ్ముడే కదా.. అని ప్రశాంతి పవన్ బైక్ ఎక్కింది. ప్రశాంతిని పవన్ నేరుగా ఒక హోటల్‌కి తీసుకెళ్లాడు. అక్కడ మురళి(ప్రశాంతి అన్న) ఎదురుచూస్తున్నాడని చెప్పాడు.  అలా హోటల్‌లోని ఒక గదిలోకి తీసుకెళ్లి ప్రశాంతిని కొట్టాడు. అప్పుడు ప్రశాంతికి తాను మోసపోయానని అర్థమైంది. ఆమె అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నించింది, కానీ పవన్‌తో పాటు సౌరభ్ కూడా ఆమెను కొట్టాడు. ఇద్దరూ కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. ఇదంతా వీడియో తీశారు. అత్యాచార విషయం బయటికి చెబితే వీడియో వైరల్ చేస్తామని బెదిరించి వదిలేశారు.


కొన్ని రోజుల తరువాత ప్రశాంతికి పవన్ మళ్లీ ఫోన్ చేశాడు. తనతో కలసేందుకు రావాలని అన్నాడు. రాకపోతే వీడియో వైరల్ అని బెదిరించాడు. అలా ప్రశాంతిని బెదిరిస్తూ పలుమార్లు ఆమెపై అఘాయిత్యం చేశాడు. ఇక అతడు పెట్టే హింసను తట్టుకోలేక ప్రశాంతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు పవన్, సౌరభ్‌ని అరెస్టు చేసి విచారణ చేశారు. అప్పుడ పవన్ జరిగిన విషయం చెప్పాడు. తన అక్క రాధను ఆమె భర్త నిత్యం హింసిస్తున్నాడని, అతనికి బుద్ధి చెప్పడానికే ప్రశాంతిపై అత్యాచారం చేశానని ఒప్పుకున్నాడు.


పవన్ ఒక సోదరుడిగా తన అక్క కోసం బాధపడడంలో తప్పులేదు. కానీ ఏ తప్పు చేయని ప్రశాంతిపై అత్యాచారం చేయడం నేరం. అందుకని పోలీసులు పవన్, సౌరభ్‌పై అత్యాచారం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇద్దరు నేరస్తులు జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

Updated Date - 2021-10-29T12:53:48+05:30 IST