భార్య గొంతు కోసి, భర్త ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-06-29T12:22:25+05:30 IST

కత్తితో భార్య గొంతు కోసి చంపి, ఆపై భర్త ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో వెలుగుచూసింది.....

భార్య గొంతు కోసి, భర్త ఆత్మహత్య

చెన్నై (తమిళనాడు): కత్తితో భార్య గొంతు కోసి చంపి, ఆపై భర్త ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో వెలుగుచూసింది. చెన్నై నగరంలోని పెరుంగలాథూర్ ప్రాంతంలోని డేవిడ్ నగర్ అద్దె ఫ్లాటులో జగన్నాథన్ (72), సులోచన (62)లు నివాసముండేవారు. అపార్టుమెంట్ టెర్రస్ పైన జగన్నాథన్ మృతదేహాన్ని చూసిన అపార్టుమెంటు వాసులు విషయాన్ని ఆమె భార్యకు చెప్పేందుకు వారి ఫ్లాటుకు వెళ్లి చూడగా రక్తపు మడుగులో సులోచన కనిపించింది.దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-06-29T12:22:25+05:30 IST