పాతకక్షల నేపథ్యంలో వ్యక్తి హత్య
ABN , First Publish Date - 2022-05-24T06:13:54+05:30 IST
పాత కక్షల నేపథ్యంలో కాకినాడ రూరల్ మండలం వాకలపూడిలో ఆదివారం అర్ధరాత్రి ఒకరు హత్యకు గురయ్యారు.
కాకినాడ
క్రైం, మే 23: పాత కక్షల నేపథ్యంలో కాకినాడ రూరల్ మండలం వాకలపూడిలో
ఆదివారం అర్ధరాత్రి ఒకరు హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలిలా
ఉన్నాయి. నేమాం గ్రామానికి చెందిన ఎదురుపాక రాంబాబు (36)కు అల్లవరపు
లోవరాజు అనే స్నేహితుడు ఉన్నాడు. లోవరాజు తమ్ముడు సత్తిబాబు 9 నెలల క్రితం
అనారోగ్యం వల్ల మృతి చెందాడు. అయితే తన తమ్ముడు మృతికి రాంబాబు కారణమని
అపోహ పడి అతడిపై లోవరాజు కక్ష పెంచుకున్నాడు. దీంతో ఆదివారం అర్ధరాత్రి
వాకలపూడి కృష్ణుడి గుడి సమీపంలో మద్యం సేవించి ఉన్న రాంబాబును లోవరాజు
పదునైన కత్తితో వెనుక నుంచి మెడపై నరకడంతో రాంబాబు అక్కడికక్కడే మృతి చెం
దాడు. అనంతరం రాంబాబు తమ్ముడు నాగబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్పవరం సీఐ
ఆకుల మురళీకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.