HYD : వధువు కావాలని పెద్ద ఎత్తున ప్రకటనలు.. Hyderabad మహిళతో పెళ్లి.. అసలు బాగోతం తెలిసి..
ABN , First Publish Date - 2022-05-07T16:21:07+05:30 IST
వధువు కావాలని పెద్ద ఎత్తున ప్రకటనలు.. Hyderabad మహిళతో పెళ్లి.. అసలు బాగోతం తెలిసి..
- అప్పలరాజు అలియాస్ నిత్యపెళ్లి కొడుకు
- ఇప్పటికే నలుగురిని పెళ్లాడిన ఘనుడు
హైదరాబాద్ సిటీ/జవహర్నగర్ : జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిత్యపెళ్లికొడుకు బాగోతం వెలుగులోకి వచ్చింది. అప్పలరాజు అలియాస్ రాజు అలియాస్ విజయ్ విశాఖపట్నంలో ఫార్మా కంపెనీలో పనిచేస్తుంటాడు. వధువు కావాలని పత్రికల్లో ప్రకటనలు, మ్యాట్రిమోనీ సైట్లో వివరాలు అప్లోడ్ చేస్తాడు. సంప్రదించిన వారిని బుట్టలో వేసుకొని పెళ్లి చేసుకునేవాడు. లాంఛనాలు, కట్నం పేరుతో అందినంత దండుకునేవాడు. ఇలా జవహర్నగర్ పరిధి దమ్మాయిగూడ, అయోధ్యనగర్కు చెందిన మహిళను ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడే కాపురం పెట్టి ఉద్యోగరీత్యా వైజాగ్ వెళ్లి వస్తుండేవాడు. ఇటీవల ఆమెకు అతడి బాగోతాలు తెలిసాయి. ఇది వరకే మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలుసుకుంది. నిలదీయడంతో అప్పలరాజు పరారయ్యాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. జవహర్నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.