భార్య, మరదలిని చంపి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.. రోజూ వెళ్లి మృతదేహాలను చూసి..

ABN , First Publish Date - 2022-04-25T18:40:36+05:30 IST

అతనికి పదకొండేళ్ల క్రితం వివాహం జరిగింది.. భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగేవి..

భార్య, మరదలిని చంపి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.. రోజూ వెళ్లి మృతదేహాలను చూసి..

అతనికి పదకొండేళ్ల క్రితం వివాహం జరిగింది.. భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగేవి.. భార్య సోదరి కూడా తరచుగా అతని ఇంటికి వెళ్లేది.. మరదలితో కూడా అతనికి విభేదాలు తలెత్తాయి.. ఈ క్రమంలో భార్యను, మరదలిని అతను దారుణంగా హతమార్చాడు.. మృతదేహాలను ఇంట్లోనే పడేసి వేరే చోట ఉంటున్నాడు.. రోజు వెళ్లి మృతదేహాలను చూసేవాడు.. దుర్వాసన వస్తోందని ఇంటి పక్క వాళ్లు ఫిర్యాదు చేయడంతో ఆదివారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 


ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు చెందిన విజయ్ ​కేతన్ 2011లో గాయత్రి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. గాయత్రి చెల్లెలు సరస్వతి కూడా భువనేశ్వర్‌లోనే ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్సుగా పని చేస్తోంది. తరచుగా అక్క ఇంటికి వెళ్లేది. ఎప్పటిలాగానే గత గురువారం కూడా సరస్వతి అక్క ఇంటికి వెళ్లింది. అయితే ఆ రోజు ఏం గొడవ జరిగిందో తెలియదు.. భార్య గాయత్రిని, మరదలిని విజయ్ దారుణంగా హత్య చేశాడు. మృతదేహాలను ఇంట్లోనే ఉంచాడు. మరోచోట బస చేస్తూ, రోజూ ఇంటికి వెళ్లి మృతదేహాలను పరిశీలించేవాడు. 



విజయ్ ఇంట్లోంచి తీవ్రంగా దుర్వాసన వస్తుండడంతో పొరుగింటి వారికి ఏదో అనుమానం వచ్చింది. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ఇంటి తలుపులు తెరిచి గాయత్రి, సరస్వతి మృతదేహాలను చూసి షాక్ అయ్యారు. వెంటనే మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విజయ్‌ ఆ హత్యలు చేయడానికి గల కారణం పూర్తి స్థాయిలో ఇంకా బయటపడలేదు. కుటుంబ కలహాల కారణంగానే హత్యలు చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ తర్వాత పూర్తి విషయాలు వెల్లడిస్తామన్నారు. 

Updated Date - 2022-04-25T18:40:36+05:30 IST