ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2022-06-30T06:45:22+05:30 IST
ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని కొత్తపల్లెలో బుధవారం చోటుచేసుకుంది.
శ్రీరంగరాజపురం, జూన్ 29: ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని కొత్తపల్లెలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ శేషావలి కధనం మేరకు.. ఎస్ఆర్పురం మండలం 49.కొత్తపల్లెమిట్ట బీసీ కాలనీకి చెందిన కృష్ణమూర్తి(51) కొత్తపల్లె గ్రామానికి చెందిన సురేష్ పొలంలో కూలి పనికెళ్లాడు. అదే పొలంలో గంగాధర నెల్లూరు మండలానికి చెందిన భూపతి ట్రాక్టర్ దుక్కి దున్నుతోంది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ట్రాక్టర్ పొలం గట్టుపైకి ఎక్కి పక్కనే పనిచేస్తున్న కృష్ణమూర్తిపై బోల్తాపడింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలిం చారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు