రైలు ఢీ కొని వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-02-20T10:28:22+05:30 IST
శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ (ఆమదాలవలస) మూడో నెంబర్ ప్లాట్పారం సమీ పంలో బుధవారం
ఆమదాలవలస, ఫిబ్రవరి 19: శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ (ఆమదాలవలస) మూడో నెంబర్ ప్లాట్పారం సమీ పంలో బుధవారం రైలు ఢీ కొన్న ప్రమాదంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి జీఆర్పీ పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు ఒడిశారాష్ట్రం వించన గ్రామానికి చెందిన బిచిత్ర నాయిక్ (33) గా పోలీ సులు గుర్తించారు. మృతుడు తమ కుటుంబసభ్యులతో కలసి అహ్మదాబాద్ నుంచి పూరి వెళ్లే రైలులో వెళ్తున్నాడు. శ్రీకాకుళం రోడ్డు రైల్వేస్టేషన్కు రైలు అర్ధ రాత్రి చేరుకునే సమయంలో తాగునీరు కోసం ఆయన రైలు నుంచి దిగాడు. రైలు కదిలి పోవటంతో ప్లాట్పారం పైనే ఉండి పోయాడని చెప్పారు. ఉదయాన్నే వేరొక రైలులో వస్తాన ని కుటుంబసభ్యులకు సమాచారం చేరవేశాడని తెలిపారు. బుధవారం ఉదయం మూడో నెంబ రు ప్లాట్ఫారం నుంచి రెండో నెంబరు ప్లాట్ఫారానికి వచ్చేందుకు ట్రాక్ దాటుతుండగా గుణు పూర్ పాసింజర్ ఢీ కొని మృతి చెందినట్టు వివరించారు. మృతుడు జేబులో ఉన్న చరవాణి ఆధా రంగా బంధువులకు పోలీసులు సమాచారం అందించారు.