రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2022-06-26T06:00:00+05:30 IST
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
శంషాబాద్ రూరల్, జూన్ 25: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన శనివారం శంషాబాద్ పోలీ్సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఊట్పల్లి గ్రామానికి చెందిన మురళి(27) పనినిమిత్తం గండిగూడకు వెళ్లి తిరిగి రోడ్డు దాటుతుండగా శంషాబాద్ నుంచి షాద్నగర్ వైపు వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో మురళి తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.