రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-06-26T06:00:00+05:30 IST

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

శంషాబాద్‌ రూరల్‌, జూన్‌ 25: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన శనివారం శంషాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఊట్‌పల్లి గ్రామానికి చెందిన మురళి(27) పనినిమిత్తం గండిగూడకు వెళ్లి తిరిగి రోడ్డు దాటుతుండగా శంషాబాద్‌ నుంచి షాద్‌నగర్‌ వైపు వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో మురళి తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 

Updated Date - 2022-06-26T06:00:00+05:30 IST