రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-05-19T06:53:15+05:30 IST

మండల పరిధిలోని రంగసముద్రం సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో హరిజన మాంతేష్‌ (35) మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

గుమ్మఘట్ట, మే 18: మండల పరిధిలోని రంగసముద్రం సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో హరిజన మాంతేష్‌ (35) మృతి చెందాడు. తాళ్లకెర నుంచి రంగస ముద్రానికి ద్విచక్రవా హనంపై వెళుతూ అదు పు తప్పి గోతిలో పడి తలకు తీవ్ర గాయా లయ్యాయి. రోడ్డుపై అటు వైపుగా వెళుతున్న వాహనదారులు గుర్తించి 108 వాహనానికి స మాచారం అందించారు. 108 వాహనసిబ్బంది అ క్కడకు చేరుకుని చికిత్స నిమిత్తం తరలించేలోగా అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయదుర్గం ప్రభు త్వాస్పత్రికి తరలించారు. గుమ్మఘట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యా ఫ్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య బేబి, కుమారుడు, కుమార్తె ఉన్నారు.


Updated Date - 2022-05-19T06:53:15+05:30 IST