రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-10-20T04:57:00+05:30 IST
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఆమనగల్లు: గుడితండా వద్ద శ్రీశైలం-హైదరాబాద్ హైవేపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం జర్కట్పల్లికి చెందిన దేవని వెంకటయ్య(40) నడుచుకుంటూ వెళ్తున్నాడు. గుడితండా వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతిచెందాడు. మృతదేహాన్ని ఎస్సై ధర్మేశ్ పోస్టుమార్టంకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.