రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-03-31T01:54:12+05:30 IST

జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. బిచ్కుంద

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కామారెడ్డి: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. బిచ్కుంద మండలంలోని గుండె నెమలి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామ శివారులో ఉన్న రహదారిపై వెళుతున్న కారు ఒక్కసారిగా చెట్టును ఢీ కొట్టింది. దీంతో బాన్సువాడకు చెందిన మహమ్మద్ సదాత్ మృతి చెందాడు. సదాత్ భార్యకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సదాత్ మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కేసు నమోదు చేసుకుని  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-03-31T01:54:12+05:30 IST