రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-03-08T04:47:33+05:30 IST
మండల పరిధిలోని కడప- తాడిపత్రి రహదారి గోటూరు పాత టోల్గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు.
వల్లూరు, మార్చి 7: మండల పరిధిలోని కడప- తాడిపత్రి రహదారి గోటూరు పాత టోల్గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ రాజగోపాల్ వివరాల మేరకు.. చెన్నూరు మండలం ఉప్పరపల్లెకు చెందిన తారక చిన్న నరసింహులు (28) ఆదివారం తెల్ల వారుజామున ఎర్రగుంట్లకు ద్విచక్ర వాహనంలో వెళుతుండగా... గోటూరు సమీపంలో ఓ ట్యాంకరు ఢీకొంది. దీంతో సంఘటనా స్థలంలోనే తల పగిలి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెటు ధరించాలని సూచించారు.